Friday, April 26, 2024

Breaking: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ..

మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 18 మంది రాజభవన్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో మంత్రులతో గవర్నర్‌ భగత్ సింగ్ కోషియారి ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులు అయిన వారిలో బీజేపీ నుంచి తొమ్మది మంది, శివసేన నుంచి తొమ్మిది మంది ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు కీలకమైన హోంశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ఇంకా శాఖలను కేటాయించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement