Sunday, May 12, 2024

ప్ర‌తి ఒక్క‌రూ చ‌ట్టాల‌ను గౌర‌వించాలి : కర్ణాటక ఎంపీ సుమలత

చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కర్ణాటక ఎంపీ సుమలత అంబరీష్ అన్నారు. హిజాబ్ వివాదంపై ఆమె మాట్లాడుతూ… కోర్టు ఆదేశాలను ధిక్కరించొద్దని హితవు పలికారు. వేరే ప్రాంతంలో ఎవరూ కూడా హిజాబ్ ను వ్యతిరేకించకపోడం బాధేస్తుందన్నారు. హిజాబ్ ముఖ్యమా.. చదువు ముఖ్యమా అని ఎవరికి వారే నిర్ణయించుకోవాలన్నారు. లేకుంటే హిజాబ్ కు అనుమతించే ఇనిస్టిట్యూషన్స్ లో జాయిన్ కావాలని సూచించారు. కానీ కొన్ని ఇనిస్టిట్యూషన్స్ మాత్రం స్టూడెంట్స్, పేరెంట్స్ తో కలిసి హిజాబ్ ను అనుమతించకుండా రూల్స్ ఏర్పరచుకున్నాయని తెలిపారు. ప్రజలే వారి ప్రాధాన్యతలను ఏర్పరచుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement