Tuesday, May 7, 2024

ఆ మందు మూడు డోసులు తీసుకున్నా.. ప‌నిచేయ‌లేద‌ట‌..

మూడు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నా కూడా ఒమిక్రాన్ వైర‌స్ అటాక్ చేసింద‌ని అంటున్నారు మ‌హారాష్ట్ర వాసి ఒక‌రు. న్యూయార్క్‌ నుంచి ఈ నెల 9న వచ్చిన 29 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలినట్లు బొంబాయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బిఎంసి) తెలిపింది. అనంతరం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌ సోకినట్లు తేలింద‌ని పేర్కొంది. కాగా, ఆ వ్యక్తికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదని, అతడు ఇప్పటికే ఫైజర్‌ మూడు డోసులు తీసుకున్నట్లు పేర్కొంది.

అతనితో సన్నిహితంగా ఉన్న ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు చేపట్టగా.. నెగిటివ్‌ అని తేలినట్లు బీఎంసీ వెల్లడించింది. జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని హాస్పిట‌ల్‌లో చేర్చిన‌ట్టు తెలిపారు అధికారులు. దీంతో వాణిజ్య రాజధానిలో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ కేసులు 15కు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40కి పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement