Thursday, April 25, 2024

ఉర్సు వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి కాలనీలో గల హజరత్ జిందా షా మదర్ దర్గా వద్ద ఈ నెల 22, 23వ తేదీల్లో ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆవిష్క‌రించారు. ఎమ్మెల్యే తన నివాసం వద్ద మైనార్టీ సోదరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్, దర్గా కమిటీ మెంబర్స్ బాబుమియా, గౌస్, నిజాం, పాషా, అయుబ్, బాబుజని, యూసుఫ్, వార్డు సభ్యులు అబ్దుల్ రహీమ్, సిద్దిక్, మసూద్, ఇబ్రహీం, అల్లావుద్దీన్, మంజూర్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement