Thursday, May 2, 2024

భారీ నష్టాలతో ముగిసిన.. స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.. కాగా అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 878 పాయింట్లు కోల్పోయి 61,799కి పడిపోయింది. నిఫ్టీ 245 పాయింట్లు నష్టపోయి 18,414కి దిగజారింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం సన్ ఫార్మా (0.08%), ఎన్టీపీసీ (0.06%) మాత్రమే లాభపడ్డాయి. టాప్ లూజర్లలో టెక్ మహీంద్రా (-3.98%), ఇన్ఫోసిస్ (-2.59%), టైటాన్ (-2.57%), హెచ్డీఎఫ్సీ (-2.07%), ఐటీసీ (-1.87%) ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement