Friday, May 3, 2024

పాన్ ఇండియా స్టార్ య‌ష్ తో భేటీ అయిన.. నారా లోకేశ్

సినిమాల‌కి ..రాజ‌కీయాలకి విడ‌దీయ‌రాని అనుబంధం ఉంద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే..కాగా టిడిపి నేత నారా లోకేష్ .. కేజీఎఫ్ హీరో యష్ ని కలవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని వైరల్ గా మారాయి. కేజీఎఫ్’ రెండు పార్ట్స్ తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించిన హీరో యష్. ప్రస్తుతం తన తర్వాత సినిమాల కోసం కథలు వింటున్నారు. మరోవైపు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాబోయే ఎలక్షన్స్ కోసం జనవరి 27 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ ఇద్దరికీ అసలు సంబంధమే లేదు. అలాంటిది సడన్ గా వీళ్లిద్దరూ భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement