Friday, May 3, 2024

కశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ఆరుగురు ఉగ్రవాదుల హతం..

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్, కుల్గాం జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జెఇఎం)కి (Jaish-e-Mohammed) చెందిన ఆరుగురు ఉగ్రవాదులు (terrorists) హతమయ్యారు. చనిపోయిన వారిలో నలుగురు ఉగ్రవాదులను మాత్రమే గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు కశ్మీర్‌లోని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్విటర్‌లో వెల్లడించింది. 

”రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జెఇఎమ్‌కి చెందిన ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరణించిన ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తాన్ కు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు. మరో ఇద్దరు ఎవరనేది భద్రతా బలగాలు పరిశీలిస్తున్నాయి. మాకు ఇది పెద్ద విజయం” అని  కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement