Friday, May 3, 2024

నీటి పారుదల శాఖ అధికారులపై సస్పెన్షన్‌ వేటు

జోనల్‌ బదిలీల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన నీటి పారుదల శాఖ అధికారులపై కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ సస్పెన్షన్ వేటు వేశారు. నీటి పారుదల శాఖ కరీంనగర్ ఈఎన్‌సీ కార్యాలయంలో పని చేస్తున్న ఎన్‌టీపీఏ ఎంఎన్‌ లక్ష్మణ్‌, సూపరింటెండెంట్‌ ఎ.అనిల్‌కుమార్‌లను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన జోనల్‌ బదిలీల ప్రక్రియలో నిబంధనల ప్రకారం సీనియార్టీ ప్రాతిపదికన కేటాయింపులు చేయాల్సి ఉండగా, వ్యక్తుల ఆధారంగా ప్రక్రియ చేపట్టినట్లు ఫిర్యాదులు రావడంతో విచారించిన కలెక్టర్‌ అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement