Friday, May 3, 2024

Education: TS ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్‌.. షెడ్యూల్ విడుదల

TS EAMCET 2021: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ 2021కు ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ షెడ్యూల్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ విడుదలచేసింది. అభ్యర్థులు ఈ నెల 25, 26వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనలకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 27న‌ ఎంసెట్ ఇంజినీరింగ్ ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 27నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.

వచ్చే నెల 2వ తేదీన తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. తొలి విడతలో అలాట్ చేసుకున్న సీట్లను రద్దు చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. తొలి విడతలో భాగంగా అలాట్ అయిన సీట్లను రద్దు చేసుకోవాలంటే అభ్యర్థులు 28వ తేదీలోగా అప్లై చేసుకోవాలని సూచించారు. ఆ తరువాత సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు.

కాగా, నవంబర్ 9వ తేదీన ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. నవంబర్ 9, 10 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుందన్నారు. నవంబర్ 12న ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుందని, 14న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదలవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement