Monday, May 13, 2024

రూ.110కోట్ల క్వారీ ఆస్తుల‌ను అటాచ్ చేసిన ఈడీ

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్‌)కు చెందిన రూ 110 కోట్ల విలువైన ఆస్తుల‌ను మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఈరోజు అటాచ్ చేసింది. భూమి, భ‌వ‌నాలు, షేర్ హోల్డింగ్స్‌, న‌గ‌దు, విదేశీ క‌రెన్సీ, బంగారు ఆభ‌ర‌ణాల రూపంలో ఈ ఆస్తులున్నాయి. కేఎస్‌బీఎల్‌తో పాటు సీఎండీ పార్ధ‌సార‌ధి ఇత‌రుల‌పై మ‌నీల్యాండ‌రింగ్ నియంత్ర‌ణ చ‌ట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ కేసు న‌మోదు చేసింది. ఇదే కేసులో ఈడీ గ‌తంలో రూ.1984 కోట్ల విలువైన ఆస్తుల‌ను అటాచ్ చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement