Monday, April 29, 2024

కేసీఆర్‌ను గద్దె దించుతాం.. టీఆర్ఎస్ కు ఇంకో ఛాన్స్ లేదు

ముఖ్యమంత్రి కేసీఆర్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ దీక్షలో ఆయన మాట్లాడుతూ.. గతంలో మాదిరి కేసీఆర్ కోసం త్యాగాలు చేసేవారు తెలంగాణ గడ్డ మీద లేరని అన్నారు. ఒక్కసారి కుప్పకూలితే టీఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చే ఆసార్కం లేదని జోస్యం చెప్పారు.  ఏడాదిలో‌ 145రోజులు ఫాంహౌస్‌లో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని ధ్వజమెత్తరు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్న ఈటల.. కేసీఆర్‌ను గద్దె దించటానికి విద్యార్థులు, యువత, నిరుద్యోగులు కలిసిరావాలని పిలుపునిచ్చారు.

నిరుద్యోగుల కలలను కేసీఆర్ ప్రభుత్వం కల్లలుగా మిగిల్చిందని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఫీల్డ్ అసిస్టెంట్ల నోట్లో మట్టికొట్టిందని విమర్శించారు.  నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. 2018లో నిరుద్యోగ భృతి ఇస్తానని మ్యానిఫెస్టోలో చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.  ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఈటల ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement