Friday, March 29, 2024

అదృశ్య‌మైన చిన్నారి.. మృతదేహంగా దొరికింది..

ఉత్తరప్రదేశ్‌లో ఓ చిన్నారి పాశవిక హత్యకు గురైంది. మొరాదాబాద్‌ పరిధిలోని ఓ గ్రామంలో ఏడేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి, హత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. మైనారిటీ వర్గానికి చెందిన బాలిక డిసెంబర్‌ 22న బుధవారం తన ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఆమె మృతదేహం శుక్రవారం రాత్రి చెరకు తోటలో కనిపించింది. శనివారం నిర్వహించిన శవపరీక్షలో బాలికపై లైంగికదాడి చేసి హత్య చేసినట్లు తేలింది.

కేసు నమోదుచేసుకున్న పోలీసులు అత్యాచారం, హత్య,పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ముగ్గురు తోబుట్టువులలో మృతురాలు చిన్నది. ఆమె తండ్రి కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. తమ బిడ్డ అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, రెండు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. చివరకు రెండు కిలోమీటర్ల దూరంలోని చెరకుతోటలో మృతదేహం బయటపడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement