Wednesday, May 15, 2024

సెంచురియన్ లో ఆగని వాన.. ఆట షురూ కాకుండానే లంచ్ కు వెళ్లిన ఆటగాళ్లు

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుపై వ‌ర్షం ఎఫెక్ట్ చూపింది.. సెంచురియన్ లో ఇప్పటికీ వర్షం పడుతూనే ఉండడంతో ఆట ఇంతవరకు ప్రారంభం కాలేదు. దాంతో ఒక్క బంతి కూడా పడకుండానే ఇరుజట్ల ఆటగాళ్లు లంచ్ కు వెళ్లారు.

లంచ్ తర్వాత అంపైర్లు మరోసారి గ్రౌండ్‌ని పరిశీలించాలని నిర్ణయించినా.. పరిస్థితి అందుకు అనుకూలంగా కనిపించడం లేదు. మోస్త‌రుగా జల్లులు కురుస్తూనే ఉండడంతో ఆట ప్రారంభం మరింత ఆలస్యం కానుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా తొలిరోజు ఆటలో 3 వికెట్లకు 272 పరుగులు చేయడం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement