Friday, April 26, 2024

కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ.. మాజీ మంత్రి ఈటలకు కీలక పదవి

హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేంద్ కు కీలక పదవి వరించింది. జాతీయ పార్టీ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు కీలక పదవులు దక్కాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా ప్రకటించారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, నేషనల్ ఎగ్జిక్యూటివ్‌ ప్రత్యేక ఆహ్వానితులు శాశ్వత ఆహ్వానితులు (ఎక్స్ అఫిషియో) లతో జాబితాను వెల్లడించారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ నాయకులు ఎల్.కే అద్వానీ, డాక్టర్ మురళి మనోహర్ జోషి, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా మరియు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ నేషనల్ ఆఫీస్ బేరర్స్ తో సహా 80 మంది సభ్యులు ఉన్నారు.

ఇక, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుండి కన్నా లక్ష్మినారాయణ, తెలంగాణ నుండి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావులకు చోటు లభించింది. జాతీయ ఆఫీస్ బేరర్లులలో తెలంగాణ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను నియమించగా.. జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించింది. జాతీయ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ నుండి సత్యకుమార్ కు చోటు దక్కగా.. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుండి విజయశాంతి, ఈటెల రాజేందర్ లకు చోటు దక్కింది.

ఇది కూడా చదవండి: అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement