Monday, April 29, 2024

నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల‌తో – నందిని రెడ్డి చిత్రం – నిజ‌మేనా !

న‌టులు నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల‌ని క‌లిపేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేస్తోంద‌ట ద‌ర్శ‌కురాలు నందినిరెడ్డి. వీరిద్ద‌రు ఏం మాయ చేశావే చిత్రంతో ప్రేమ‌లో ప‌డి గ్రాండ్‌గా మ్యారేజ్‌ చేసుకున్నారు. అటు హిందూ సాంప్రదాయల ప్రకారం, అటు క్రిస్టియన్‌ ట్రెడిషన్‌ ప్రకారం రెండుసార్లు వీరి వివాహం జరిగింది. టాలీవుడ్‌లో అత్యంత లగ్జరీ మ్యారేజ్‌గా వీరి వివాహం నిలిచింది. మరోవైపు దాదాపు నాలుగేండ్లు కలిసున్నారు చైతూ, సామ్‌. అన్యోన్య దంపతులుగా పేరుతెచ్చుకున్నారు. ఆదర్శజంటగానూ నిలిచారు. అయితే ఉన్నట్టుండి ఏం జరిగిందో ఏమోకారణాలు తెలియవు గానీ వీరిద్దరు విడిపోతున్నట్టు గతేడాది అక్టోబర్‌ 2న ప్రకటించి షాకిచ్చారు. ఫ్యాన్స్ నే కాదు, యావత్‌ టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకి షాకిచ్చారు. కాగా త్వరలో నాగచైతన్య, సమంత కలవబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. చైతూ, సమంత కలిసి ఓ సినిమా చేయబోతున్నారనేది ఈ వార్త సారాంశం.

దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా, సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. లేడీ డైరెక్టర్‌ నందిని రెడ్డి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారట. సమంతతో నందిరెడ్డి ఓ బేబీ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే వీరిద్దరితో ఓ సినిమా చేయాలనే కమిట్‌మెంట్‌ ఉందట. దాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చినట్టు సమాచారం. నాగచైతన్య, సమంత జంటగా ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్రయత్నం చేస్తుందట. దీనికి నాగచైతన్యలను, సమంతలను ఒప్పించే పనిలో ఉన్నారని సమాచారం. చైతూ వైపు నుంచి సానుకూల స్పందన ఉందని, సమంతని ఒప్పించే పనిలో నందినిరెడ్డి గట్టి ప్రయత్నం చేస్తుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతోగానీ ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్‌ అవడంతోపాటు హాట్‌ టాపిక్‌గానూ మారింది. ఇదే జరిగితే, ఇద్దరి అభిమానులకు పండగే ..ఇదొక సెన్సేషనల్‌ ప్రాజెక్ట్ కాబోతుందని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement