Tuesday, May 14, 2024

ప్రధానిగా రాలేదు.. మీ పెద్దన్నగా వచ్చాను: మోడీ

సోల్జర్స్ ధైర్య సాహసాలు దీపావళికి మరింత శోభ తెచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ రోజు జవాన్లతో కలిసి దీపావళి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో సైనికులతో కలిసి ప్రధాని మోడీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. తాను ప్రధానిగా రాలేదని.. మీ కుటుంబసభ్యుడిగా.. పెద్దన్నగా వచ్చానన్నారు.

సైన్యం కోసం 130 కోట్ల మంది ఆశీస్సులు తీసుకొచ్చానని తెలిపారు ప్రదాని నరేంద్ర మోడీ. ప్రతి దీపావళిని సైనికులతోనే జరుపుకుంటున్నానని, ప్రతికూల పరిస్థితుల్లో సైనికులు రక్షణగా నిలుస్తున్నారని అన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమన్న మోడీ.. సైన్యంలోనూ మహిళలకు ప్రాధాన్యమిస్తున్నమిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement