Sunday, May 5, 2024

ట్రాఫిక్ ర‌ద్దీ వ‌ల్లే – ముంబైలో మూడు శాతం విడాకులు – అమృతా ఫ‌డ్న‌వీస్

ముంబైలో 3శాతం విడాకులు ట్రాఫిక్ ర‌ద్దీ వ‌ల్లే జ‌రుగుతున్నాయ‌ని మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌విస్ భార్య అమృతా ఫ‌డ్న‌వీస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు. ఈ మేర‌కు ఆమె ప్ర‌భుత్వంపై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. ముంబైలోని రహదారులు, ట్రాఫిక్ రద్దీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశౄరు. తాను సైతం ప్రయాణిస్తున్న సమయంలో రోడ్లపై ఎన్నో గతుకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాన‌ని చెప్పారు. నేను సాధారణ పౌరురాలిగానే చెబుతున్నాను. నేను బయటకు వెళ్లినప్పుడల్లా గోతులు, ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ వల్ల ప్రజలు తమ కుటుంబాలకు తగినంత సమయం కేటాయించే అవకాశం ఉండడం లేదు. అమృత ఫడ్నవిస్ ను అధికార మహా వికాస్ అఘాడీ నాయకులు తరచూ లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తుంటారు. దీంతో ఆమె సైతం అవకాశం చిక్కినప్పుడల్లా అధికార పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు వదులుతుంటారు. రీసెంట్ గా ఆమె చేసి వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement