Thursday, April 25, 2024

Shamshabad Airport: భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ క‌స్ట‌మ్స్ అధికారుల‌కు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.38.59 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్ళేందుకు ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన ఇద్దరిపై అనుమానం రావడంతో వారిని తనిఖీ చేయగా వారి వద్ద విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement