Sunday, May 5, 2024

పెళ్లి మండ‌పంలో భారీ అగ్నిప్ర‌మాదం – ఓ వ్య‌క్తికి స్వ‌ల్ప గాయాలు

పెళ్లి మండ‌పంలో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ సంఘట‌న ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 11లో సీఎన్ జీ స్టేష‌న్ స‌మీపంలో జ‌రిగింది. ఈ మంటపం కర్రలతో, పీవోపీలతో చేసి ఉండటంతో వేగంగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలకు సంబంధించిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కొన్ని మైళ్ల దూరం ఆకాశంలో దట్టమైన పొగ కనిపించింది. ఈ ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు ఆ సైట్‌లో ఎవరూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. కాగా ఈ ఘ‌ట‌న‌లో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయనకు ప్రథమ చికిత్స అందించినట్టు అధికారులు తెలిపారు. ఘ‌ట‌నాస్థ‌లికి సుమారు 12 ఫైర్ ఇంజిన్లు స్పాట్‌కు వెళ్లాయి. మ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

https://twitter.com/SoumitMohan/status/1506934801164795909
Advertisement

తాజా వార్తలు

Advertisement