Sunday, May 5, 2024

కేజ్రీవాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న – గోవాలో ప్ర‌తి మ‌హిళ‌కి రూ.1000

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ గోవాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా త‌మ పార్టీ మ్యానిఫెస్టోను విడుద‌ల చేశారు. కాగా 18ఏళ్లు పైబ‌డిన ప్ర‌తి మ‌హిళ‌కు గోవాలో వెయ్యి రూపాయ‌లు ఇస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కేజ్రీవాల్. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. గోవాలో 24×7 ఉచిత విద్యుత్ సౌకర్యంతో పాటు, మంచి నీటి వసతి కల్పిస్తామన్నారు. గోవాలోని రోడ్లను మరమ్మత్తులు చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన, ఉచిత నిర్భంధ విద్య అందిస్తామని ప్రకటించారు. కాగా.. గోవాలో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.ఈ నేపథ్యంలో.. గోవాలో బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement