Thursday, April 25, 2024

ప్రజల గుండెల్లో కొలువైన దైవం కేసీఆర్

తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్… బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో కొలువైన దైవమని పేర్కొన్నారు. రామగుండం కార్పోరేషన్ పరిధిలోని 28, 30, 39,41 డివిజన్‌లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమైక్య పాలనలో లంబడితాండాల్లో ఆడపిల్ల పుడితే అమ్ముకునే పరిస్థితి నెలకొని ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పేదవారి ఇండ్లల్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మిగా భావించే పరిస్థితి తీసుకువచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే అని అన్నారు.

ఆడబిడ్డ పెళ్లికి పేదవారికి భారం కావొద్దని భావించి సీఎం కెసిఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి ఆడపిల్ల పెళ్లికి లక్ష 116 రూపాయలు అందించి వారి కళ్లల్లో ఆనందం నింపుతున్నారని చెప్పారు. రామగుండం నియోజక వర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తాము అహర్నిశలు కృషి చేస్తున్నాని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement