Saturday, April 27, 2024

విమానాశ్ర‌యంలో చెల‌రేగిన మంట‌లు – త‌ప్పిన ముప్పు

విమానాశ్ర‌యంలోని టోయింగ్ వాహ‌నంలో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దాంతో అప్ర‌మ‌త్త‌మైన ఫైర్ సిబ్బంది మంట‌ల‌ని ఆర్పివేసింది. ఈ సంఘ‌ట‌న ఢిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్ అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై అంతర్గత విచారణ జరుపుతున్నారు. అలాగే ఈ విషయంపై విమాన కార్గో విభాగం కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోందన్నారు. కార్గో బేలో విమానాల పార్కింగ్ కోసం వినియోగించే.. టోయింగ్ వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. ఫైర్ ఇంజిన్‌కు కాల్ చేసింది. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. అయితే ఈ టోయింగ్ వాహనం పలు విమానాలకు దగ్గర్లో ఉంది. మంటలు త్వరగా అదుపులోకి తీసుకురావడంతో భారీ ముప్పు తప్పింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement