Tuesday, May 14, 2024

Vikarabad: వైద్యం కోసం వచ్చిన బాలింత మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన

వికారాబాద్ (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ప్రైవేటు ఆస్ప‌త్రి నిర్వాకంతో ఓ నిండుగ‌ర్భిణీ ఇవ్వాల (శ‌నివారం) చ‌నిపోయింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన గర్భిణీ ప్రసవానంతరం మరణించిన ఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ మండలం మైలారం దేవరంపల్లి గ్రామానికి చెందిన రమాదేవి (25) చికిత్స కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వ‌చ్చింది. రక్తం తక్కువ ఉంది, రక్తం కావాలని ఆమె కుటుంబ సభ్యులకు డాక్ట‌ర్లు తెలిపారు.

అయితే.. వారు రక్తం తీసుకువచ్చే లోపు ర‌మాదేవికి నొప్పులు వ‌చ్చాయి. ఇంత‌లోనే ప్ర‌స‌వం కావ‌డం, బాబు పుట్టిన త‌ర్వాత‌ ఆమె చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. కాగా, పుట్టిన బాబు సజీవంగా ఉన్నట్టు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్నబాలింత కుటుంబ సభ్యులు ఆస్పత్రి యజమానితో ఘర్షణకు దిగారు. దీంతో వికారాబాద్ టౌన్ సీఐ శీను ఇరువర్గాలను శాంతింపజేసి న‌చ్చ‌జెప్పి పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement