Saturday, May 18, 2024

Breaking: కూకట్‌పల్లి నాలా నుంచి కొట్టుకొచ్చిన డెడ్ బాడీ.. మెద‌క్ జిల్లా వాసిగా గుర్తింపు

హైద‌రాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద చిల్డ్రన్ పార్క్ లోకి ఓ డెడ్ బాడీ కొట్టుకురావడంతో కలకలం మొదలైంది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి విచారణ జరిపారు. కూకట్‌పల్లి నాలా నుంచి ఈ డెడ్‌బాడీ కొట్టుకొచ్చినట్లుగా ప్రాథ‌మిక అంచ‌నాకు వ‌చ్చారు పోలీసులు.. కాగా, మృతదేహం చిత్యంరెడ్డి అనే మెదక్ జిల్లా వాసిగా గుర్తించారు. రెస్క్యూ టీమ్ & అమీర్‌పేట్ పోలీసుల సహకారంతో మంగళవారం సాయంత్రం సమయంలో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుని జేబులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన‌ గోపాల్‌పేట్ పోలీసులు దీనిపై మ‌రింత ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement