Wednesday, May 8, 2024

స‌వాల్ లో నెగ్గిన ‘జ‌గ్గారెడ్డి’

తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో విజ‌యం సాధించింది. కాగా మెద‌క్ ఎమ్మెల్సీస్థానంపై కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి స‌వాల్ విసిరారు. ఆ స‌వాల్ లో ఆయ‌న నెగ్గారు.మెద‌క్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి 200కంటే ఒక్క ఓటు త‌క్కువ వ‌చ్చినా పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ విసిరారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మెద‌క్ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి 238ఓట్లు వ‌చ్చాయి. దాంతో ఆయ‌న విసిరిన స‌వాల్ లో నెగ్గారు. కాంగ్రెస్ త‌ర‌పున జ‌గ్గారెడ్డి భార్య నిర్మ‌ల జ‌గ్గారెడ్డికి 238ఓట్లు రావ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement