Sunday, April 28, 2024

క్యాన్స‌ర్ బాధితుల‌కు ఆరోగ్యశ్రీ లో చికిత్స : ఏపీ స‌ర్కార్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని క్యాన్సర్ బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలని స‌ర్కార్ నిర్ణ‌యించింది. ఈ మేరకు క్యాన్సర్ బాధితులకు ఉత్తమ చికిత్స అందించేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కనీసం మూడు క్యాన్సర్‌ సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్‌ కాలేజీల్లో సూపర్‌ స్పెషాల్టీ సేవలు అందుతాయని ఇవికాకుండా క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రత్యేకంగా మూడు సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు ఏర్పాటవుతాయని తెలిపారు. ఏపీలో క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీల ఆస్పత్రులు లేకపోవడం వల్ల ప్రజలు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు తరలి వెళ్లాల్సి వస్తోందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కోసం ప్రత్యేక యాప్‌ తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ఆమోదం తెలిపారు. ఇందు కోసం సలహాల నివృత్తికి ఏర్పాట్లు ఉండేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement