Sunday, April 28, 2024

రాహుల్ పర్యటన వేళ కాంగ్రెస్ కు షాక్.. టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన సందర్భంగా భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలానికి చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ,  అనుబంధ సంఘాల నాయకులు శుక్రవారం ఉదయం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్ని పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను మెచ్చి  టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

కాగా, టీఆర్ఎస్ లో చేరిన వారిలో  మొగుళ్ళపల్లి మండలం మెట్టుపల్లి గ్రామ గండ్ర సత్తన్న యువసేన మండల పార్టీ యూత్ అధ్యక్షులు గజ్జి రాజ్ కుమార్, మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చిలుకమరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల కోశాధికారి లడే రాజు, మెట్టుపల్లి కాంగ్రెస్ సీనియర్ నేతలు మోత్కూరి చంద్రమౌళి, గజ్జి శ్రీను, కోటగిరి జితేందర్, రాసమల్ల రవి, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement