Friday, March 29, 2024

Covid-19: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరగుతున్నాయి. రోజు వారి కేసులు భారీగా పెరిగిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,94,938కు చేరాయి. ఇందులో 4,25,51,248 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 27 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య  5,24,002కి చేరింది. అలాగే, 3549 మంది డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 19,688 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్నాయి. ఢిల్లీలో 1365 కేసులు నమోదు అయినట్లు కేంద్రం తెలిపింది. ఇక ఇప్పటివరకు 1,89,81,52,695 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement