Saturday, May 4, 2024

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో 36స్థానాల్లో కాంగ్రెస్.. మ్యాజిక్ ఫిగ‌ర్ దాటేసిన పార్టీ

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో మ్యాజిక్ ఫిగ‌ర్ ని దాటేసింది కాంగ్రెస్ పార్టీ.. హిమాచల్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలు ఉండగా, 35 స్థానాలు గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ 36 స్థానాల్లో గెలిచి మరో 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 23 స్థానాల్లో గెలిచి మరో 2స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ హిమాచల్ ప్రదేశ్ లో బోణీయే చేయలేకపోయింది. ఇతరులు మూడు ఓట్లు గెలిచారు.

గుజరాత్ ఓట్ల లెక్కింపులో అధికార బీజేపీ హవా కొనసాగుతోంది. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి ఇటీవల రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. నేడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి బీజేపీ 131 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. మరో 25 స్థానాల్లో గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. కాంగ్రెస్ మరీ దారుణంగా 10 స్థానాల్లో గెలిచి, 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభంజనం సృష్టిస్తామని చెప్పిన ఆప్ 2 స్థానాల్లో నెగ్గి, 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇతరులు 4 చోట్ల గెలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement