Thursday, May 2, 2024

ఉక్రెయిన్ పై సైనిక చ‌ర్య ఇప్ప‌ట్లో ముగియ‌దు.. స్పష్టం చేసిన పుతిన్

ఉక్రెయిన్ పై సైనిక చ‌ర్య ఇప్ప‌ట్లో ముగియ‌ద‌ని స్ప‌ష్టం చేశారు ర‌ష్యా దేశాధ్య‌క్షుడు పుతిన్.కాగా ర‌ష్యా మానవ హక్కుల మండలి వార్షిక సమావేశం జ‌రిగింది.ఈ స‌మావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అణ్వస్త్రాలను ఉపయోగించే స్థాయిలో పరిణామాలు ఆందోళనకరంగా మారుతున్నాయన్నారు. అయితే అణ్వస్త్రాలు ఎప్పుడు ప్రయోగించాలన్నదానిపై తమకు నియంత్రణ ఉందని చెప్పారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటగా అణ్వాయుధాలను వాడబోమని, ఒకవేళ తమపై ఎవరైనా అణుదాడికి పాల్పడితే కచ్చితంగా అణ్వస్త్రం ప్రయోగిస్తామని చెప్పారు.

అణుదాడి పేరిట తాము ఎవరినీ బెదిరించడంలేదని, అణ్వస్త్రాల పట్ల తమకు అవగాహన ఉందన్నారు. తమ వద్ద అత్యాధునిక అణ్వాయుధాలు ఉన్నాయని, అయితే తమ అణ్వాయుధాలేవీ విదేశాల్లో లేవని పుతిన్ స్పష్టం చేశారు. అమెరికా మాత్రం తన అణ్వాయుధాలను టర్కీలో ఉంచిందని ఆరోపించారు. పుతిన్ వ్యాఖ్యలను అమెరికా ఖండించింది. అణ్వాయుధాలపై రష్యా ఇష్టానుసారం మాట్లాడుతోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. రష్యా వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement