Wednesday, May 22, 2024

కాంగోలో ఘోర రైలు ప్ర‌మాదం – 61మంది మృతి – 52మందికి గాయాలు

కాంగోలో ఘోర రైలు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 61మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా మ‌రో 52మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆఫ్రికా దేశమైన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఆగ్నేయ ప్రాంతంలో కొల్వేజి నగరానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని బయోఫ్వే వద్ద రైలు పట్టాలు తప్పడంతో ఏడు బోగీలు పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. చాలా వరకు మృతదేహాలు ఇంకా బోగీల్లోనే చిక్కుకుపోయాయి. మొత్తం 15 వేగన్లు ఉన్న ఇది సరుకు రవాణా రైలు అని, ఖాళీగా ఉన్న 12 బోగీల్లో వందలాది మంది ప్రయాణికులు ఎక్కారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement