Wednesday, May 8, 2024

యాదాద్రి పేరులో క‌న్ఫ్యూజ‌న్.. క్షేత్రం పేరును మార్చారా?

తెలంగాణ‌లోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేతం యాద‌గిరి ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి కొలువై ఉన్న యాద‌గిరిగుట్ట‌ పేరులో ఇప్పుడు క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న స‌మ‌యంలో యాద‌గిరిగుట్టగా పిలుస్తున్న ఈ క్షేత్రం పేరును రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మ‌రింత‌గా అభివృద్ధి చేసేందుకు సంక‌ల్పించిన సీఎం కేసీఆర్.. క్షేత్రం పేరును యాదాద్రిగా మార్చారు. అయితే తాజాగా ప్ర‌భుత్వం ఈ క్షేత్రం పేరును రెండు ర‌కాలుగా పేర్కొంటూ జ‌నాన్ని డైల‌మాలో ప‌డేసింది.

సోమ‌వారం సీఎం కేసీఆర్ స‌తీస‌మేతంగా యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం కార్యాల‌యం(సీఎంఓ) పీఆర్వో ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌ను ఆయ‌న తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ విడుద‌ల చేశారు. ఇక ఇంగ్లీష్ ప్ర‌క‌ట‌న‌లో యాదాద్రిగా క్షేత్రం పేరును పేర్కొన్న పీఆర్వో… తెలుగు ప్ర‌క‌ట‌న‌లో మాత్రం యాద‌గిరిగుట్ట‌గా పేర్కొన్నారు. దీంతో ఈ క్షేత్రం పేరును అస‌లు మార్చారా? లేదా? అన్న దిశ‌గా అయోమ‌యానికి గుర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement