Saturday, May 4, 2024

ఆచార్య టీంకి – తెలంగాణ స‌ర్కార్ శుభ‌వార్త – ఐదో ఆట‌కి అనుమ‌తి

ఈ మ‌ధ్య కాలంలో సినిమా వారికి అనుకూలంగా ఉంటోంది తెలంగాణ స‌ర్కార్. కొత్త చిత్రాల‌కి అనుగుణంగా ఆర్డ‌ర్ల‌ని జారీ చేస్తోంది..టిక్కెట్ల పెంపున‌కి సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. కాగా మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న ఆచార్య చిత్రానికి ఐదో ఆట‌కి అనుమ‌తినిచ్చింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఆచార్య ఈ నెల 29న విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఐదో ఆట‌కు అనుమ‌తి మంజూరు చేస్తూ తెలంగాణ స‌ర్కారు కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం ఈ నెల 29న విడుద‌ల కానున్న అచార్య చిత్రాన్ని ఏడు రోజుల పాటు రోజుకు 5 ఆట‌ల చొప్పున ప్ర‌ద‌ర్శ‌న‌కు వీలుంది. అంతేకాకుండా సినిమా హాళ్ల‌లో ఆయా కేట‌గిరీల‌ను బ‌ట్టి టికెట్ రేట్ల‌ను కూడా పెంచుకునేందుకు సినిమా థియేట‌ర్ల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ఏసీ కేటగిరీలో మాత్ర‌మే ఈ పెంపును ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ఈ ధ‌ర‌ల‌ను రూ.30 నుంచి రూ.50కి పెంచుకేనేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ టికెట్ల పెంపు కూడా ఏడు రోజుల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement