Thursday, May 2, 2024

Nara Lokesh: ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్లు?

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. సీపీఎస్‌ను ర‌ద్దు చేస్తామ‌న్న హామీని నిల‌బెట్టుకోవాలంటూ యూటీఎఫ్ పిలుపునిచ్చిన సీఎంవో కార్యాల‌యం ముట్ట‌డిని అడ్డుకోవడంపై మండిపడ్డారు. ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్లు? అంటూ ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలపడమే నేరమంటూ యూటీఎఫ్ నేతలను, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులను, ఉపాధ్యాయులను అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు. మరి వారం రోజుల్లో సీపీఎస్ రద్దని మాట తప్పి మడమ తిప్పిన మిమ్మల్ని నిలదీయొద్దా జగన్ మోసపు రెడ్డి? అని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్బంధకాండని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాకమ్మ కబుర్లతో మూడేళ్లు గడిపేశారని విమర్శించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చెయ్యండని లోకేశ్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement