Saturday, April 27, 2024

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. టీడీపీ వర్సెస్ వైసీపీ

అమరావతిలోని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉండవల్లిని చంద్రబాబు ఇంటి ముట్టడికి వైసీపీ నాయకులు యత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ నేతల మద్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్ల దాడులు చేసుకున్నారు. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో చంద్రబాబు బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా అక్కడికి వెళ్లారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు అందోళన చేపట్టారు. చంద్రబాబు క్షపాపణ చెప్పలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు చంద్రబాబు ఇంటికి వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించడంతో టీడీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగి రమేష్, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వైసీపీ నేతలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పృహ తప్పి పడిపోయారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

ఇది కూడా చదవండి: జడ్పి టిసి,ఎంపిటిసి ఓట్ల లెక్కింపుపై సీఎస్ కీలక మార్గదర్శకాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement