Sunday, May 12, 2024

ముగిసిన శ్రీ సుంద‌ర రాజ‌స్వామి వారి – అవ‌తార మ‌హోత్స‌వాలు

శ్రీ సుంద‌ర రాజ‌స్వామి వారి అవ‌తార మ‌హోత్స‌వాలు ఘ‌నంగా ముగిశాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్నాయి ఈ ఆల‌యాలు. చివరిరోజు స్వామివారు గరుడవాహనంపై భక్తులను దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖమండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి అభిషేకం నిర్వహించారు.సాయంత్రం 5.30 నుంచి 6.15 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌ సేవ, రాత్రి 7 గంటల నుంచి స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. నిన్న శ్రీవారిని 75,472 మంది భక్తులు దర్శించుకోగా 38,335 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా స్వామివారి హుండీకి రూ. 3.87 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement