Wednesday, May 15, 2024

Breaking: UPలో ఘోర రోడ్డుప్ర‌మాదం .. 10మంది యాత్రికుల మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న మినీ వ్యాన్‌ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఈ ప్ర‌మాదంలో 10 మంది యాత్రికులు మృతిచెంద‌గా, మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.

వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మొత్తం 18 మంది హరిద్వార్‌లో స్నానం చేసి తిరిగివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement