Friday, April 26, 2024

మాజీ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కు సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శ‌

తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఇవాళ‌ ఉద‌యం తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను ఆయ‌న‌ పరామ‌ర్శించారు. మాజీ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. సోమ‌వారం న‌ర‌సింహ‌న్‌కు శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం కేసీఆర్.. ఇవాళ న‌ర‌సింహ‌న్‌ను కావేరీ ఆస్ప‌త్రిలో ప‌రామ‌ర్శించి, ఆరోగ్య వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. మాజీ గ‌వ‌ర్న‌ర్ మ‌రో 3-4 రోజులు ఆస్ప‌త్రిలోనే ఉండ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement