Tuesday, May 14, 2024

CM Bommai: గాల్లో చక్కర్లు కొట్టిన సీఎం విమానం..

కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రయాణిస్తున్న విమానం అరగంటపాటు గాలిలో చక్కర్లు కొట్టడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. అయితే, వారు సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శాసన మండలి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రి బొమ్మై నిన్న బెంగళూరు నుంచి విమానంలో హుబ్బళ్లికి వచ్చారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఆయన వెంట ఉన్నారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న ఇండిగో 6E7227 విమానం హుబ్బళ్లికి చేరుకునే సరికి వాతావరణం అనుకూలించ లేదు. మంచు దట్టంగా కమ్ముకోవడంతో రన్‌వే కనిపించలేదు. దీంతో ల్యాండింగ్ సాధ్యం కాలేదు. ఫలితంగా విమానం అరగంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత వాతావరణం అనుకూలించడంతో విమానం ల్యాండ్ అయింది.

విమానం హుబ్బళ్లి విమానాశ్రయానికి నిర్ణీత సమయానికి ఉదయం 7.30 గంటలకు చేరుకుంది. అయితే దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండింగ్‌కు అనుమతి లభించలేదు. దీంతో అధికారులు టెన్షన్ కి గురైయ్యారు. అయితే, విమానం గాలిలో మూడు రౌండ్లు వేసి సురక్షితంగా ల్యాండ్ అయింది.  దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement