Thursday, May 2, 2024

10కోర్టుల స‌ముదాయ భ‌వనాన్ని ప్రారంభించిన‌ సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ

సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఇవాళ‌ హ‌నుమ‌కొండలో ప‌ర్య‌టిస్తున్నారు. హ‌నుమ‌కొండ జిల్లాలోని 10 కోర్టుల స‌ముదాయ భ‌వ‌నాన్ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించిన పది కోర్టుల సముదాయాన్ని, పోక్సో కోర్టు, ఫ్యామిలీ కోర్టును ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ స‌తీష్ చంద్ర‌శ‌ర్మ‌, హైకోర్టు న్యాయ‌మూర్తులు ఉజ్జ‌ల్ బుయాన్, రాజ‌శేఖ‌ర్ రెడ్డి, జ‌స్టిస్ న‌వీన్ రావు, వ‌రంగల్ జిల్లా జ‌డ్జి ప్రిన్సిప‌ల్ జ‌డ్జి నందికొండ న‌ర్సింగ‌రావు, ప‌లువురు న్యాయ‌వాదులు, సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement