Saturday, April 27, 2024

Flash: ఎయిర్‌పోర్ట్‌లో కూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్లు దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని విమానాశ్రయంలో గురువారం రాత్రి హెలికాప్టర్ కుప్పకూలడంతో ఇద్దరు పైలట్లు మరణించారు.
ఈ ప్రమాదంలో కెప్టెన్ గోపాల్ కృష్ణ పండా, కెప్టెన్ ఏపీ శ్రీవాస్తవలు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. విమానాశ్రయంలో హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తు సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని తెలిపారు. ఇద్దరూ మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారని చెప్పారు. హెలికాప్టర్‌లో ప్రయాణికులు ఎవరూ లేరని పేర్కొన్నారు. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో రాత్రి 9:10 గంటలకు ఫ్లయింగ్ ప్రాక్టీస్ సందర్భంగా ఈ సంఘటన జరిగిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement