Tuesday, April 23, 2024

Breaking: గన్‌తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య

కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోపాల కృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ముందు రోజే ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు బందోబస్తుకు వెళ్లారు. గురువారం రాత్రి తన ఇంట్లో‌నే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ సమీపంలోని జగ్గయ్య చెరువుకు చెందిన గోపాలకృష్ణ 2014లో ఎస్సైగా ఎంపికయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో కాకినాడలో ట్రాఫిక్ విభాగంలో పనిచేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గోపాలకృష్ణ మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement