Friday, April 26, 2024

కెన‌డాలో ఘ‌నంగా టీఆర్ ఎస్ ఆవిర్భావ వేడుక‌లు

టీఆర్ ఎస్ ఎన్ ఆర్ ఐ కెన‌డా విభాగం ఆధ్వ‌ర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో భారీ సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కెనడా విభాగం అధ్యక్షుడు కృష్ణ కోమండ్ల వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ సబ్బండ వర్గాలను ఏకంచేసి 14 ఎండ్లు పోరాడారని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెగించి కొట్లాడటంతో 60 ఎండ్ల స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందన్నారు. మఘాలో పుట్టింది పుబ్బలో పోతదని టీఆర్‌ఎస్‌ పార్టీని నాడు ఎంతో మంది ఎగతాళి చేశారని, కానీ కేసీఆర్ తన చాణక్య నీతితో దేశంలోని రాజకీయ పార్టీలన్నింటిని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. అమరుల త్యాగాలు వెలకట్టిలేనివని 12 వందల మంది విద్యార్థులను బలి తీసుకున్న చరిత్ర నాటి పాలకులదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పోరాడి స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడిందని నాటి ఉద్యమ రోజులను గుర్తు చేసుకున్నారు.మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో వివిధ అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను రాష్ట్రంలో నెలకొల్పుతున్నాయని చెప్పారు. దీంతో వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చాయని, యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement