Sunday, May 12, 2024

Breaking: బస్సు లోయలో పడి.. 16 మంది మృతి..

ఓ ప్రైవేటు బస్సు లోయలో పడి.. 16మంది మృతిచెందిన విషాద ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పలువురు గాయపడ్డారు. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జునుజ్జు అయింది. జిల్లాలోని సైంజికి వెళ్తుండగా ఉదయం 8.30 గంటల సమయంలో జాంగ్లా వద్ద అదుపుతప్పిన బస్సు.. లోయలో పడిపోనట్లు సమాచారం. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తలించామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement