Wednesday, May 1, 2024

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..?

గత రెండు రోజుల్లో భారీగా పెరిగిన పసిడి ధరలు ఈరోజు మాత్రం స్థిరంగానే కొనసాగాయి. హైదరాబాద్‌లో జూలై 4న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 52,340 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగానే ఉంది. పది గ్రాములకు రూ. 48 వేల వద్ద కొనసాగుతోంది. కాగా బంగారం ధరలు గత రెండు రోజుల్లో భారీగా పెరిగాయి. రూ. 1450 మేర ర్యాలీ చేసింది. వెండి రేటును గమనిస్తే.. సిల్వర్ ధర స్థిరంగానే ఉంది. వెండి ధర కేజీకి రూ. 63,500 వద్ద కొనసాగుతోంది.

ఉత్పత్తి తక్కువ.. వినియోగం ఎక్కువ
బంగారం ఉత్పత్తి మన దేశంలో చాలా తక్కువ అని చెప్పుకోవాలి. కానీ వినియోగం మాత్రం చాలా అధికంగా ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా జరిగిన బంగారం ఉత్పత్తి కేవలం 1,127 కేజీలు. అయితే అదేసమయంలో మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంగారం 6,51,240 కేజీలు. అంటే బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో వాణిజ్య లోటు పెరిగిపోతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి క్షీణిస్తూ వస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు కేంద్రం గోల్డ్ దిగుమతి సుంకాలను పెంచింది.

కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచడం ఆశ్చర్యకరమైన నిర్ణయం అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ (కమొడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్) సుగంధ సచ్‌దేవ్ తెలిపారు. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు, వాణిజ్య లోటును నియంత్రించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. మే నెలలో వాణిజ్య లోటు 23.33 బిలియన్ డాలర్లకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement