Saturday, May 18, 2024

లారీలో భారీగా మంటలు..

హైదరాబాద్ లో వివారులోని ఆటోనగర్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆటోనగర్‌ సమీపంలో జాతీయ రహదారిపై ఓ లారీలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి లారీ పూర్తిగా దగ్ధమయింది. ప్రమాద సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ ప్రమాదంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో ప్రమాదానికి గురైన లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement