Tuesday, May 7, 2024

Breaking : బైక్ ని ఢీ కొన్న పికప్ వాహ‌నం – చిన్నారి మృతి

పిక‌ప్ వాహ‌నం అదుపుత‌ప్పి బైక్ ని ఢీ కొంది. ఈ ప్ర‌మాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మ‌హ‌రాజ్ గంజ్ జిల్లా కొల్హుయ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లబ్దాహాలో నివాసముంటున్న వాజివుల్లా కుమారుడు అబూ హరీరా దుర్మరణం చెందాడు. ఫర్హాన్, అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు పికప్ వాహ‌నానాన్ని ఢీకొన్న బైక్ రైడర్ బబ్లూ శర్మ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు యాక్సిడెంట్ చేసిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఓ అజిత్‌సింగ్‌ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement