Wednesday, May 8, 2024

Breaking : బండి సంజ‌య్ ఫిర్యాదు – ప‌లువురు అధికారులకు లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తతో పాటు పలువురు అధికారులకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు మేరకు నోటీసులు పంపింది.ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ నోటీసులు అందించింది. డీజీపీ మహేందర్ రెడ్డి, కరీంనగర్ సీపీ సత్యనారాయణ, ఏసీపీ శ్రీనివాస రావు, జగిత్యాల డీఎస్పీకి ప్రకాష్ తో పాటు కరీంనగర్‌ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement