Sunday, May 19, 2024

HYD : నాలాలో కొట్టుకొచ్చిన రెండు మృతదేహాలు

ఇద్దరు యువకుల మృతదేహాలు నాలాలో కొట్టుకు వ‌చ్చిన ఘ‌ట‌న సికింద్రాబాద్ ప్రాంతంలోని బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టిస్తుంది. ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో గుర్తుతెలియని రెండు మృతదేహలు నాలాలో కొట్టుక రావడంతో బస్తీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బేగంపేట్ పోలీసులు డీఆర్ఎఫ్, క్లూస్ టీం ఘటన స్థలానికి చేరుకుని యువకుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అనంతరం మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుల‌ వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement