Friday, May 24, 2024

Breaking : డోరండా కేసులో లాలూప్ర‌సాద్ కి బెయిల్

దాణా కుంభకోణానికి సంబంధించిన డోరండా కేసులో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ ఇవ్వాలని సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు లాలూ తన విడుదల కోసం కోర్టులో రూ.10 లక్షలు డిపాజిట్ చేశారు. జార్ఖండ్ హైకోర్టు నుండి బెయిల్ బాండ్ బుధవారం దిగువ కోర్టుకు పంపబడింది. బెయిల్ బాండ్ చెల్లించామని లాలూ ప్రసాద్ తరపు న్యాయవాది ప్రభాత్ కుమార్ తెలిపారు. దాణా కుంభకోణానికి సంబంధించిన డోరండా ట్రెజరీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. దొరండా ట్రెజరీ నుంచి రూ.139 కోట్లు విత్‌డ్రా చేసిన ఘటనకి సంబంధించింది ఇది. 1990.. 1995 మధ్య డోరాండా ట్రెజరీ నుండి రూ.139 కోట్లు విత్‌డ్రా చేయబడ్డాయి. 27 ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో లాలూ యాదవ్‌ను దోషిగా నిర్ధారించిన స్కాంపై కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో లాలూ యాదవ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. లాలూ యాదవ్‌కు హైకోర్టు నుండి బెయిల్ వచ్చింది, కానీ ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. AIIMS నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఏప్రిల్ 30 సాయంత్రంలోగా ఆయన పాట్నా చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement